తెలంగాణకు వర్ష సూచన 1 d ago
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోపక్క అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం తెలిపింది. క్యూమలో నింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్ర సమయాల్లో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.