Sharwanand: ఏపీలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న శర్వానంద్.. 10 d ago

సినీ నటుడు శర్వానంద్ కృష్ణా జిల్లా, మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.